బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం తెలుగులో ప్రసారమవుతూ ఇప్పటికే నాలుగు వారాలను పూర్తి చేసుకుంది.అయితే ప్రతి సీజన్ దాదాపు 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమయ్యేది కానీ ఈ సీజన్ మాత్రం కేవలం 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది.
ఇప్పటికే నలుగురు హౌస్ నుంచి వెళ్లగా కేవలం పది మంది మాత్రమే హౌస్ లో కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే ప్రేక్షకులకు కూడా హౌస్ లో కంటెస్టెంట్లు పల్చగా ఉండడంతో పెద్దగా ఈ కార్యక్రమం పై ఆసక్తి తగ్గుతున్న క్రమంలోనే బిగ్ బాస్( Bigg Boss) సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మరో ఆరుగురు కంటెస్టెంట్లను హౌస్ లో పంపించడానికి బిగ్ బాస్ రంగం సిద్ధం చేశారని సమాచారం.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ మినీ లాంచ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.అక్టోబర్ 8వ తేదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆరుగురు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించబోతున్నారట.ఇలా హౌస్ లో ఉన్నటువంటి 10 మంది ఈ ఆరుగురు కంటెస్టెంట్లతో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ అందించేలా బిగ్ బాస్ అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది.
మరి అక్టోబర్ 8వ తేదీ మినీ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఏ ఏ కంటెస్టెంట్లను నాగార్జున (Nagarjuna ) హౌస్ లో పాల్గొనబోతున్నారనే విషయానికి వస్తే.
మినీ బిగ్ బాస్7 లాంచ్ కార్యక్రమంలో భాగంగా ముందు నుంచి వినపడుతున్నటువంటి పేర్లలో ప్రముఖ సీరియల్ నటుడు అంబంటి అర్జున్( Arjun ) అలాగే సీరియల్ నటి అంజలి పవన్( Anjali Pawan ) పాల్గొనబోతున్నారు.అలాగే సీరియల్ నటి పూజా మూర్తి( Pooja Murthi ) , నయని పావని( Nayani Pavani ) మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి,( Bhole Shamili ) జబర్దస్త్ కెవ్వు కార్తీక్ ( Kevvu Karthik )ఈ ఆరుగురు ఆదివారం మినీ లాంచ్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.ఇక నాలుగు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీలా, మూడవ వారం సింగర్ దామినీ, నాలుగవ వారం రతిక ఈ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయ్యారు.