తెలుగు బిగ్ బాస్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుంది.ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆరవ సీజన్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
కాగా బిగ్ బాస్ ప్రేమికులు ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవలే లోగో,టీజర్ నీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇవి షోపై అంచనాలను మరింత పెంచేసాయి.ఇది ఇలా ఉంటే ఈసారి షోలో ఎవరు పాల్గొనబోతున్నారు? ఏ సెలబ్రిటీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అదేవిధంగా ఈసారి ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతోంది అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రేక్షకుల అంచనాల మేరకు బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా అందుకు తగ్గట్టుగానే షోలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన లిస్టు కూడా ఇప్పటికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
కాగా ఒకవేళ చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలి అన్నది కూడా ముందుగానే ప్లాన్ చేశారట షో నిర్వాహకులు.ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.
బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ రివ్యూయర్స్ ఆదిరెడ్డి, గీతు రాయల్, జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్,శ్రీ సత్య, దీపిక పిల్లి, అర్జున్ కళ్యాణ్, యాంకర్ ఆరోహి రావు, వాసంతి కృష్ణన్, అలాగే నువ్వు నాకు నచ్చావు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప లు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
అలాగే మరొకవైపు యాంకర్ ఉదయభానుకి కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి పిలుపు రాగా ఆమె ఇంతవరకు తన నిర్ణయాన్ని చెప్పలేదట.వీడుతో పాటుగా ఆర్జే సూర్య, నేహా చౌదరి, హీరోయిన్ ఇయన సుల్తానా, అప్పారావు, తన్మయిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఒక ఫిమేల్ సింగర్ ని రంగంలోకి దింపుతున్నారట.
ఆమె ఎవరో కాదు బుల్లెట్ బండి సింగర్ మోహన భోగరాజు. ఈమె డైరెక్ట్ గా ఎంట్రీ లేదంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఇందుకోసం మోహన భోగరాజు భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.కాగా బిగ్ బాస్ 6 సెప్టెంబర్ నాలుగు నుంచి ప్రసారం కానున్న విషయం తెలిసిందే.