తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో మొన్నటి వరకు విన్నర్ ప్రైజ్ మనీలో కోతలు కోసిన బిగ్ బాస్ ఇప్పుడు మళ్లీ ఆ ప్రైజ్ మనీ ని పెంచుకునేందుకు హౌస్ మేట్స్ కు కు అవకాశం కల్పించాడు.ఈ క్రమంలోనే టాస్కులు ఇస్తూ ఏక అభిప్రాయంతో చెప్పాలి అంటూ మెలిక పెట్టాడు.
ఈ క్రమంలో బిగ్బాస్ రెండో ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రేవంత్, ఇనయ పోటీపడ్డారు.అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్గా గెస్ చేస్తే రూ.1,10,000 ప్రైజ్మనీకి తిరిగి యాడ్ చేస్తానని చెప్పాడు బిగ్ బాస్.
అందరూ అనుకున్నట్లుగా పిరమిడ్ పడొద్దు అనే ఛాలెంజ్లో రేవంత్ విజయం సాధించడంతో రూ.1,10,000 గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్బాస్.ఆ తర్వాత మూడో ఛాలెంజ్ కోసం ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంచుకోమన్నాడు.
దీంతో ఆదిరెడ్డి కీర్తి, శ్రీహాన్ శ్రీసత్య మనీ ట్రాన్స్ఫర్ గేమ్లో పోటీపడ్డారు.ఇనయ, రేవంత్, రోహిత్.
ఆదిరెడ్డి టీమ్ గెలుస్తుందని చెప్పారు.కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీహాన్ శ్రీసత్య గెలవడంతో వారు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు.
ఆ తరువాత శ్రీ సత్య ఒక దెయ్యం కథ చెప్పింది.
ఒక ఫంక్షన్ ఒక అబ్బాయి వింతగా ప్రవర్తించాడని అందరూ ఆ అబ్బాయిని కొడుతున్న అతనికి చలనం లేకుండా పోయిందని, తర్వాత అతడు అలాగే నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడు అని చెప్పింది శ్రీ సత్య. ఇంతలో సడన్గా దెయ్యం సౌండ్ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్ బెడ్ మీదకు చేరింది.ఇక శ్రీహాన్ అయితే బాత్రూమ్కి వెళ్లడానికి కూడా భయపడ్డాడు.
అది గమనించిన శ్రీసత్య కావాలని దెయ్యంలా నవ్వుతూ అతడిని మరింత భయపెట్టింది.ఇక ఇనయ అయితే ఏకంగా దెయ్యం పట్టినదానిలా ప్రవర్తించి ఆదిరెడ్డిని వణికిపోయేలా చేసింది.