బుల్లితెరపై బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది.కొట్లాటలు నవ్వులతో రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరగగా ఇందులో మానస్ తనకు దక్కిన గొడ్డలిని అతనికి ఇచ్చాడు.బిగ్ బాస్ సన్నీ కి స్పెషల్ పవర్ ను ఇచ్చాడు.
ఈ క్రమంలోనే ఒకరి నుంచి సగం బంగారు ముత్యాలను తీసుకొని మరొకరికి ఇవ్వాలని సూచించగా, సిరి దగ్గర ఉన్న గోల్డ్ ను షణ్ముఖ్ కు ఇచ్చాడు సన్నీ.ఇక ఈ టాస్ కు మొదటి రౌండులో ఎక్కువ బంగారం పింకీ సంపాదించింది.
అనంతరం యాంకర్ రవి సిరి, షణ్ముఖ్ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఇద్దరు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యామని, అందుకే షన్ను టిప్పు అవుతున్నాడని సిరి అనగా.
అప్పుడు రవి మీరిద్దరు ఒకరినొకరు బాగా సీరియస్ గా తీసుకుంటున్నారు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.కానీ ఈ విషయం నీ విషయంలో షణ్ముఖ్ ఎందుకు ట్రిప్ అవుతున్నాడో! ఒక్క నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడు ఒకసారి ఆలోచించు నీకు అర్థమవుతుంది అనుకుంటా అంటూ అడిగాడు రవి హితవు పలికాడు.
అనంతరం శ్రీ రామ్ చంద్రకు పవర్ వచ్చినప్పటికీ అది అతనికి అనుకూలంగా రాలేదు.
అప్పుడు బిగ్ బాస్ 30 బంగారు ముత్యాలను ఇవ్వాలని ఆదేశించగా, అతని దగ్గర ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో పథకం రచించిన నా దగ్గర పవర్ ఉంది అంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు.ఇక చివర్లో తనకు స్పెషల్ పవర్ రాలేదు అంటూ బాంబు పేల్చాడు.ఇక రెండవ రౌండ్లో సన్నీ, సిరి బంగారం వెతుకులాటలో టాప్ లో ఉండగా వీరిలో ఒకరికి కంటెండర్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్.
కాకపోతే సిరి తరఫున వేరొకరు ఛాలెంజ్ లో పాల్గొనాలి అని ట్విస్ట్ ఇవ్వగా సిరి తనకోసం మానస్ పోటీపడతారని చెప్పింది.ఇక సన్నీ ఓడించేందుకు రంగంలోకి దిగి మానస్ గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండర్ చేశాడు.