బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ చూస్తుండగానే 11వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.19 మందితో గ్రాండ్ గా మొదలైన ఈ షోలో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు.తాజాగా 11వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది.నామినేట్ చేయాలి అనుకున్న వ్యక్తులు తలపై ఒక ద్రవాన్నీ పోయాలని ఆదేశించాడు బిగ్ బాస్.మొదట రవి ఇతను ఫేక్ అనడం నచ్చలేదంటూ సన్నీని రెచ్చగొట్టిందంటూ కాజల్ నీ నామినేట్ చేశాడు.
షణ్ముఖ్ కాజల్ ఇంటి నుంచి వెళ్ళిపోతే గొడవలు తగ్గిపోతాయని ఆశిస్తున్నాను అంటూ ఆమెను నామినేట్ చేస్తూ, ప్రియాంక సింగ్ పై ద్రవాన్నీ పోశాడు.
షన్ను అనీ మాస్టర్ ను, శ్రీరామ్, మానస్ ను నామినేట్ చేశారు.ఇక కాజల్ మాట్లాడుతూ నేను ఎంత ట్రై చేసినా కనెక్ట్ కాలేదనీ, పైగా వెక్కిరించడం నచ్చలేదంటూ అనీ మాస్టర్ ను నామినేట్ చేసింది.
దీంతో అనీ మాస్టర్ కుప్పిగంతులేసి ఆమె సహనాన్ని పరీక్షించింది.ఇక సిరి కెప్టెన్సీ కండెన్సర్ టాస్క్ లో ప్రియాంక సింగ్ తనకు సపోర్ట్ చేయలేదని మానస్ గేమ్ కూడా తానే ఆడుతున్నట్టు నామినేట్ చేసింది.
ఆపై సిల్లీ రీసన్స్ ఇవద్దు అంటూ కాజల్ పై ద్రవాన్ని గుమ్మరించింది.
ఆ తరువాత పింకీ సిరి, షణ్ముఖ్ లను నామినేట్ చేసింది.సన్నీ శ్రీరామ్ తో పాటు సిరిని కూడా నామినేట్ చేశారు.ఆ తర్వాత అనీ మాస్టర్ మానస్ తలపై బాటిల్ ను గుమ్మరించింది.
ఆ తర్వాత కాజల్ ను నామినేట్ చేస్తూ వెక్కిరించింది.ఇలా వెక్కిరించడాన్ని అగౌరపరచడం అంటారని కాజల్ అనగా, అప్పుడు అనీ వెక్కిరించడం అంటే అవమానించడం అని ఏ ఒక్కరితో అనిపించినా ఆ రోజు నేను నీ కాళ్ళు మొక్కుతాను, అది కూడా సాష్టాంగ నమస్కారం చేస్తాను అంటూ శపథం చేసింది.
ఇలా నామినేషన్ ప్రక్రియ ఎంతో రసవత్తరంగా కొనసాగిందని చెప్పవచ్చు.