తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే కంటెస్టెంట్ ను మరింత హ్యాపీగా ఉంచడం కోసం నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ ను మరింత స్పెషల్ గా ముస్తాబు చేశారు.
ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లకు సంబంధించిన మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ను ఆహ్వానించారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ స్టేజ్ పైకి మొదట షణ్ముఖ్ అన్నయ్య ఎంట్రీ ఇచ్చారు.
అయితే షణ్ముక్ కోసం మొదట అన్నయ్య మాత్రమే వచ్చారని నాగార్జున చెప్పగా షణ్ముఖ్ మొదట నిరాశ చెందాడు.ఏంటి బాధగా ఉన్నట్టున్నావ్ నన్ను చూసి అని షణ్ముఖ్ అన్న ప్రశ్నించగా.
నీకన్నీ అర్థం అవుతాయిలే అంటూ షణ్ముఖ్ నవ్వుతు సమాధానమిచ్చాడు.అప్పుడు వెంటనే ఎవరినో ఎక్సపెక్ట్ చేస్తే నేను వచ్చాను,అందుకే నిరాశగా ఉన్నాడు అంటూ షణ్ముఖ్ అన్న సంపత్ సమాధానమిచ్చారు.
ఈ లోపు షణ్ముఖ్ అనుకుంటున్న విధంగానే దీప్తి సునైనా ఎంట్రీ ఇవ్వడంతో, షణ్ముఖ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
దీప్తి సునైనా మాట్లాడుతూ.సచ్చినోడా నిన్ను చాలా మిస్ అయ్యాను అంటూ చెప్పగా.షణ్ముఖ్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు.
ఈ విధంగా షణ్ముఖ్ కోసం దీప్తి సునయన రావడంతో ఒక్కసారిగా హౌస్ లో ఉన్న షన్ను ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు.ఇక వేదికపై షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ దీప్తి సునైనా నాగార్జున ముందే షణ్ముఖ్ ను సచ్చినోడా అంటూ తిట్టడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
ఏదిఏమైనా దీప్తి సునయన రాకతో షన్ను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని చెప్పవచ్చు.