బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేసిన బిగ్ బాస్.ప్రస్తుతం నాలుగో సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
మొత్తం 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి.తమదైన శైలిలో రచ్చ షురూ చేశారు.
ఇక షో మొదలైన రెండో రోజే తొలి వారం ఎలిమినేషన్స్ ప్రక్రియను మొదలుపెట్టగా.నామినేషన్స్లో అభిజిత్, సూర్య కిరణ్, అకిల్ సార్థక్, దివి, మెహబూబ్, యాంకర్ సుజాత, గంగవ్వ నిలిచారు.
ఈ ఏడుగురిలో ఒకరు తొలి వారమే బ్యాగ్ సర్దేసి.మిగిలిన ఇంటి సభ్యులకు గుడ్ బై చెప్పునున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4లో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు అన్నది బుల్లితెర ప్రేక్షకుల్లో ఉత్కంఠగా మారింది.అయితే వాస్తవానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎలిమినేషన్ ప్రేక్షకులపైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ప్రేక్షకుల ఓటింగ్ బట్టీ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తారు.అయితే ఈ ఓటింగ్ ప్రకియలో అందరూ భావించినట్టే మోస్ట్ స్పెషల్ కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ గంగవ్వకు అత్యధిక ఓట్లు నమోదైనట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత స్థానంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ ఉండగా.మూడో స్థానంలో దివి నిలివడం విశేషం.
ఇక ఆ తర్వాతి స్థానాల్లో సత్యం డైరెక్టర్ సూర్య కిరణ్, మెహబూబ్, జోర్దార్ సుజాత నిలిచారు.అయితే చిట్ట చివరిగా అకిల్ సార్థక్ కు తక్కువ ఓటింగ్ నమోదైనట్టు సమాచారం.
దీని బట్టీ చూస్తే అకిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు.మరి ఈ ఉత్కంఠ వీడాలంటే.
రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.కాగా, గత మూడు సీజన్లతో పోలిస్తే.
నాలుగో సీజన్ కాస్త ఘోరంగానే ఉందని చెప్పాలి.మొత్తం 16 మంది కంటెస్టెంట్లలో దాదాపు చాలా మంది కంటెస్టెంట్లు.
ప్రేక్షకులకు పరిచయం లేని వారు ఉన్నారు.ఇక వారు పెర్ఫామెన్స్తో ఆకట్టుకోపోగా.
ఓవర్ యాక్షన్తో గత నాలుగు రోజుల నుంచి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నారు.మరి ముందు ముందు కూడా ఇలాగే కంటిన్యూ అయితే.
షోకు గట్టి దెబ్బ తగిలే అవకశాలు ఉన్నాయి.