బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్.ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది.ఇప్పుటి వరకు ఎనిమిది మంది కాంటెస్టెంట్లు దుకాణం సద్దేయగా.ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నారు.అయితే బిగ్ బాస్ హౌస్లో అత్యంత కష్టమైన పని నామినేషన్.ఈ నామినేషన్ సమయంలో ఇంటి సభ్యుల అసలు రంగు బయటపడుతుంటుంది.
ఇక్కడే గొడవలు కూడా స్టాట్ అవుతూ ఉంటాయి.క్లారిటీగా చెప్పాలంటే ఈ సమయంలో ఒక చిన్న పాటి యుద్ధమే జరుగుతుంటుంది. అయితే ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ కూడా హాట్ హాట్గా సాగింది.ఈ వారం అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్ మరియు అమ్మ రాజశేఖర్ మాస్టర్ నామినేట్ అయ్యారు.
ఇక వీరిలో లాస్య, అరియానా, అఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు.వాస్తవానికి అరియానా మొదట్లో కాస్త ఓవర్ యాక్షన్ చేసినా.ఆ తర్వాత బాగా పుంజుకుంది.ఆమె ఆట తీరు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
దీంతో ఆమె నామినేషన్కు వచ్చినా.ప్రేక్షకులు, అభిమానులు సేవ్ చేస్తున్నారు.
ఇక లాస్య గురించి చెప్పాల్సిన పని లేదు.ఆమెకు బయట చాలా ఫాలోంగ్ ఉంది.ఈ క్రమంలోనే ఆమెను సేవ్ చేయాలంటూ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.దీంతో ప్రతి వారం ఈమె నామినేషన్కు వచ్చినా.
సేవ్ అవుతోంది.మరోవైపు అఖిల్ సైతం తన గేమ్ తాను ఆడుతూ చాలా స్ట్రోంగ్గా మారాడు.
మరియు తనకు అస్సల పడని అభిజిత్తో కూడా కలిసిపోయిన అఖిల్ ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు.అఖిల్ కూడా ఖచ్చితంగా సేఫ్ అవుతాడని అందరికీ నమ్మకం ఉంది.
అయితే ఎటొచ్చీ మోనాల్, అమ్మ రాజశేఖర్ మాస్టర్, మెహబూబ్ డేంజర్లో జోన్లో ఉన్నారు.వీరిపై మొదటి నుంచి ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మెహబూబ్ టాస్క్ల్లో యాక్టివ్గా ఉన్నా.ఇతర విషయాల్లో ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తున్నాడు.
అలాగే అమ్మ రాజశేఖర్ పెద్దగా గేమ్ అడకపోగా.అందరిపై విరుచుకుపడుతున్నాడు.
ఇక మోనాల్ ప్రవర్తన కారణంగా.ప్రేక్షకులు ఈమె ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి ఈ వారం మోనాల్, అమ్మ రాజశేఖర్ మాస్టర్, మెహబూబ్లలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని అందరూ నమ్ముతున్నారు.