బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ను అనుకోని కష్టాలు చుట్టుముడుతున్నాయి.గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 4 అటు కంటెస్టెంట్ల పరంగా ఇటు రేటింగుల పరంగా అనుకున్న స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోతుంది.
మొదట్లో ట్రై యాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తి పెంచిన బిగ్ బాస్ ప్రస్తుతం అర్థంపర్థం లేని టాస్కులతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి.మరోవైపు నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కు గోవాకు వెళ్లడంతో రేపు ఆయన హోస్ట్ గా హాజరవుతాడో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు లీకేజీలు బిగ్ బాస్ సీజన్ 4పై ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గిస్తున్నాయి.సాధారణంగా బిగ్ బాస్ షోలో ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది.
అయితే ఎలిమినేషన్ కు ఒకరోజు ముందే ప్రేక్షకులకు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలిసిపోతుంది.మూడో వారం దేవి నాగవల్లి ఎలిమినేషన్ కు ఒకరోజు ముందే ప్రముఖ క్రిటిక్ ఒకరు ఆమె ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
గత వారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయిందని వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.చివరకు లీకేజ్ వార్తలే నిజమై స్వాతి నిజంగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
అయితే ఎలిమినేషన్ మాత్రమే కాకుండా నామినేషన్ లోకి ఎవరెళ్లారనే విషయాలు, కెప్టెన్ గా ఎవరు గెలిచారనే విషయాలు ముందుగానే లీక్ అయిపోతూ ప్రేక్షుకుల్లో బిగ్ బాస్ షోపై క్యూరియాసిటీని తగ్గిస్తున్నాయి.మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సైతం బిగ్ బాస్ షోకు ఏ మాత్రం ప్లస్ కాలేకపోయాయి.
బిగ్ బాస్ షోకు పని చేసే సిబ్బందిలో కొందరు ఈ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు.బిగ్ బాస్ నిర్వాహకులు వీళ్లను గుర్తించి జాగ్రత్త వహిస్తే మంచిది.లేకపోతే మాత్రం షో రేటింగులపై లీకుల ప్రభావం తప్పకుండా పడుతుందని చెప్పవచ్చు.