తెలుగు బిగ్బాస్ సీజన్ 3 మూడవ వారం ముగింపు దశకు చేరుకుంది.నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున ఇంటి సభ్యులతో కాస్త సీరియస్ చర్చ జరిపాడు.
శుక్రవారం వరకు జరిగిన పరిణామాలు చూస్తే నాగార్జున ఇంకా సీరియస్ అవుతాడని అంతా అనుకున్నారు.గత వారం మొత్తం తమన్నా సింహాద్రిపై ఫోకస్ ఉంది.
ఆమె ప్రవర్తన ఎంత జుగుప్సకరంగా సాగింది అంటే ఆమె ప్రవర్తనతో వెంటనే బిగ్బాస్ ఇంటి నుండి బయటకు పంపించాల్సిందే అన్నట్లుగా సీరియస్ సీన్ క్రియేట్ అయ్యింది.
ఖచ్చితంగా తమన్నాను నాగార్జున ఓ రేంజ్లో ఏకేస్తాడని అంతా అనుకున్నారు.
కాని నిన్నటి ఎపిసోడ్లో ఎక్కువగా టార్గెట్ అయ్యింది అలీ.టాస్క్లో భాగంగా హిమజ డబ్బులు ఇవ్వకపోవడంతో జేబులోంచి డబ్బు లాక్కోవడం ఏంటీ అంటూ అలీ సీరియస్ అయ్యాడు.అలా అమ్మాయిలపై పడి డబ్బు లాక్కున్నందుకు ఏకంగా 20 గుంజీలు తీయించాడు.షో ప్రారంభం అయిన వెంటనే అలీతో గుంజీలు తీయించడం జరిగింది.దాంతో అలీ మొహం కంది పోయింది.ఆ తర్వాత అలీని సీరియస్గానే మందలించాడు.
సరే అలీ తప్పు చేశాడు కనుక మందలించాడు.మరి ఇతరులు చేసిన తప్పుల గురించి నాగార్జున మాట్లాడక పోవడం విమర్శల పాలవుతుంది.
తమన్నాను లైట్గా వార్నింగ్ ఇచ్చి వదిలేయడంతో పాటు రాహుల్ ఇష్టం వచ్చినట్లుగా నోరు జారినా కూడా నాగార్జున మెల్లగా వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు.ఇక శ్రీముఖి చేసిన పనికి రవి చేతికి గాయం అయ్యింది.అయినా కూడా శ్రీముఖిపై పెద్దగా చర్చ ఏం పెట్టలేదు.ఇక వితిక విషయంలో కాస్త స్పందించాడు.పునర్నవి ఎలిమినేషన్ సందర్బంగా ఓవర్ యాక్షన్ చేసింది.తనను తాను నామినేషన్ చేసుకుని రచ్చ చేసింది.
ఆ విషయాన్ని కూడా నాగ్ మర్చి పోయాడు.దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అలీకి ఒక న్యాయం ఇతర ఇంటి సభ్యులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు.