బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 కు సన్నీ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.సన్నీ విన్నర్ అవుతాడని చాలామంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ముందే భావించగా ఆ అంచనాలే ఎట్టకేలకు నిజమయ్యాయి.
తన ప్రవర్తనతో అభిమానుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు పలువురు సెలబ్రిటీల నుంచి సపోర్ట్ లభించడం వల్ల సన్నీ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో కౌశల్ సన్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే జరగడానికి ఆరు వారాల ముందే సన్నీ విన్నర్ అని నాకు తెలుసని కౌశల్ చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ విన్నింగ్ మూమెంట్ ను తాను సరిగ్గా ఎంజాయ్ చేయలేదని కౌశల్ తెలిపారు.
బిగ్ బాస్ షోకు విన్నర్ గా నిలిచిన తర్వాత ప్రజలతో తిరిగానే తప్ప ఫ్యామిలీతో తిరగలేదని కౌశల్ కామెంట్లు చేశారు.తాను గెలవడానికి కారణమైన వాళ్లలో వీలైనంత మందిని కలవాలని తాను భావించానని కౌశల్ చెప్పుకొచ్చారు.
కౌశల్ ఆర్మీ అంత యాక్టివ్ గా ఉందా అంటే కరోనా వచ్చిన తర్వాత నేను బిజీ అయిపోయానని వాళ్ల పనులలో వాళ్లు కూడా బిజీ అయిపోయారని కౌశల్ చెప్పుకొచ్చారు.తనీష్ తో తనకు గొడవ లేదని ఒక సినిమా వల్ల తనీష్ తన గురించి నెగిటివ్ కామెంట్లు చేశాడని కౌశల్ అన్నారు.నేను ఓడించిన వ్యక్తులకు ఒక టీవీ ఛానల్ కు సాన్నిహిత్యం ఉందని అందువల్ల వాళ్లు నన్ను టీవీ ఛానల్ ద్వారా టార్గెట్ చేశారని కౌశల్ వెల్లడించారు.
అందరూ బిగ్ బాస్ గేమ్ ను గెలవడానికి వెళితే నేను ఇన్స్పైర్ చేయడానికి వెళ్లానని కౌశల్ చెప్పుకొచ్చారు.ఒక మహిళ నా వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను విరమించుకున్నారని కౌశల్ కామెంట్లు చేశారు.నన్ను విన్నర్ చేయకూడదని కొంతమంది టార్గెట్ చేశారని కౌశల్ అన్నారు.
బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదని కౌశల్ చెప్పుకొచ్చారు.