సినీ, టెలివిజన్ నటి రాఖీ సావంత్నటిగా కాకుండా నాట్య కారిగా కూడా పేరు సంపాదించుకుంది.ఇక ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ముగిసిన హిందీ బిగ్ బాస్ 14 వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్ లో ఉన్నంత కాలం తనేంటో తాను నిరూపించుకుంది.మొత్తానికి చివరి వరకు రాగా ఇందులో సీరియల్ నటి రూబీనా దిలైక్ టైటిల్ విన్నర్ గెలుచుకుంది.కానీ ఆమె రూ.50 లక్షల ప్రైజ్ మనీ తో కాకుండా కేవలం 35 లక్షలు మాత్రమే గెలుచుకుంది.
రుబీనా కేవలం ఇంతే డబ్బుతో వెళ్లడానికి కారణం ఏంటంటే గ్రాండ్ ఫినాలే లో ప్రతి సీజన్ కి ఉండే ఆప్షన్ సొంతంగా డబ్బులు తీసుకొని ఎలిమినేట్ అవ్వడం.ఈసారి కూడా అదే ఫాలో అవ్వగా ఇందులో రాఖీ సావంత్ ముందుకి వచ్చి రూ.14 లక్షలు తీసుకుంది.ఆమె నిర్ణయం అందరిని ఆకట్టుకోగా తాజాగా ఆమె కొన్ని విషయాలు పంచుకుంది.
అంతేకాకుండా ఆమెకు పిల్లలను కనాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.
ఆమె బిగ్ బాస్ లో కచ్చితంగా గెలుస్తానని నమ్మకంతో ఉందట.కానీ తనకు ఉన్న నమ్మకం కాస్త రూబీనా గెలిచే అవకాశం ఎక్కువ ఉండటం వల్ల తాను తగ్గిందట.దీంతో ఓటమి చెందితే రన్నరప్ గా లేదా సెకండ్ రన్నరప్ గా నిలిచే అవకాశం ఉందంటూ కాబట్టి దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేనందున ప్రైజ్ మనీ తీసుకొని తప్పుకోవడం సరైనదని అనుకుందట.
ఎందుకంటే తన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉన్నప్పటికీ తనకిప్పుడు డబ్బులు చాలా అవసరం అని తెలిపింది.తన అమ్మకు ఆరోగ్యం బాలేనందున తన చికిత్సకు తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోగా ఈ డబ్బులు తీసుకొని ఎలిమినేట్ అయ్యానని తెలిపింది.
దీంతో ఇప్పుడు తన అమ్మ ఆరోగ్యానికి సరిపడ డబ్బులు ఉన్నాయంటూ తెలిపింది.
అంతేకాకుండా ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన భర్త ప్రముఖ వ్యాపారవేత్త రితేష్ గురించి తెలిపింది.
అతడికి ఇదివరకే పెళ్లైయిందని ఓ బిడ్డ కూడా ఉందని ప్రేక్షకులతో పంచుకుంది.కానీ ఈ విషయం గురించి బయటకు చెప్పొద్దని మాట తీసుకున్నాడట.
కానీ ఆమె చెప్పకనే బయటకి చెప్పింది.దీంతో ఆమె తన భర్త ఎలా స్పందిస్తారో తెలియదు కానీ, విడాకులు ఇవ్వచ్చని తెలిపింది.
ఇదిలా ఉంటే ఆమెకు ప్రస్తుతం మాతృత్వాన్ని పొందాలని మనసులో మాటను బయటకు తెలిపింది.అంతేకాకుండా తన అందాలను భద్రపరచిదంటూ కాని తనకు విక్కీడోనర్ అవసరం లేదని తన బిడ్డకు నిజమైన తండ్రి కావాలని తెలిపింది.
తనకు ఒంటరిగా ఉండటమే ఇష్టం లేదని అది ఎలా సాధ్యం అవుతుందో అర్థం కావట్లేదని కాని దీనికి కూడా పరిష్కారం త్వరలోనే దొరుకుతుందని తెలిపింది
.