బిగ్ బాస్ సీజన్ 5లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అయిన సన్నీ, శ్రీరాం చంద్ర మండే జరిగే నామినేషన్స్ లో వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తుంది.ఎవిక్షన్ పాస్ సన్నీ దక్కించుకోవడంలో కాజల్ ఆడిన గేం ప్లాన్ పై మండిపడుతున్న శ్రీరాం చంద్ర అదే రీజన్ చెప్పి కాజల్ ను నామినేట్ చేసినట్టు అర్ధమవుతుంది.
ఇక మరోపక్క సన్నీ మీద కూడా శ్రీరాం చంద్ర గొడవకి దిగాడు.సన్నీ గ్రూప్ ఆట ఆడి ఎవిక్షన్ పాస్ దక్కించుకున్నాడని అన్నాడు.
ఈ నామినేషన్ ఫైట్ లో శ్రీరాం చంద్ర, సన్నీల మధ్య పెద్ద గొడవే జరిగినట్టు తెలుస్తుంది.కెప్టెన్ మానస్ మధ్యలో జోక్యం చేసుకుని వారిద్దరికి సర్ధి చెప్పాలని ప్రయత్నించాడు.
బిగ్ బాస్ సీజన్ 5లో ప్రస్తుతం ఉన్న ఎనిమిది మంది హౌజ్ మెట్స్ లో నలుగురు ఒక గ్రూప్ మరో నలుగురు ఇంకొక గ్రూప్ అన్నట్టుగా ఉంది.మరి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్నది ఆడియెన్స్ డిసైడ్ చేస్తారు.
ఈ వీక్ నామినేషన్స్ లో కెప్టెన్ మానస్ తప్ప మిగతా అందరు నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం ఇంకా నాలుగు వారాలు మాత్రమే ఉన్న ఈ సీజన్ లో ప్రతివారం నామినేషన్స్ చాలా కీలకంగా మారనున్నాయి.