బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది.మరో 3 వారల్లో ముగుస్తున్న ఈ సీజన్ లో చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ నిలిచాడు.
ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ గా ఫన్నీ ట్రైన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.ఇందులోనే ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వార్డ్, బ్యాక్ వార్డ్ చేస్తున్నాడు.
అంటే ఈరోజు రేపు హౌజ్ మెట్స్ యొక్క ఇంటి సభ్యులు వస్తారన్నమాట.ఇన్నాళ్లు గొడవలతో సాగిన బిగ్ బాస్ సీజన్ 5 కాస్త ఫన్నీ మోడ్ లోకి వెళ్లింది.
ముఖ్యంగా హౌజ్ మెట్స్ అంతా ఫ్రీజ్ అయినప్పుడు మిగతా వారు వాళ్లని ఆటపట్టించడం బాగుంది.
ఇన్నాళ్లు టాస్కుల్లో గొడవలు పడిన ఈ టీం ఇప్పుడు ఇలా సరదాగా కలిసి ఉండటం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది.
ముఖ్యంగా బయట హౌజ్ మెట్స్ కి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కూల్ అయ్యే అవకాశం ఉంటుంది.ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈరోజు శ్రీరాం సిస్టర్ తో పాటుగా కాజల్ హస్బండ్ ఆమె కూతురు హౌజ్ లోకి వస్తారని తెలుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ ఫన్ తో మొదలైన ఎమోషనల్ గా కొనసాగుతుందని అంటున్నారు.