బిగ్ బాస్ సీజన్ 5లో శనివారం ఎపిసోడ్ నాగార్జున జోష్ ఫుల్ యాంకరింగ్ తో అలరించింది.ఇక ఎప్పటిలానే మండే టు ఫ్రై డే వరకు జరిగిన విషయాల మీద రివ్యూ ఇచ్చిన నాగార్జున నామినేషన్స్ టైం లో లోబో, ప్రియ మీద అరిచిన విధానం పై క్లాస్ పీడాడు.
ఇక మరో పక్క బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా ఐదు బిగ్ బాస్ యాప్ లను ఒక్కొక్క హౌజ్ మెట్ వచ్చి అందులో ఏ యాప్ ఎవరికి వర్తిస్తుందో చెప్పాలని అంటాడు.ఈ క్రమంలో అందరు తమ తమ అభిప్రాయాలని చెప్పారు.
ఇక ఇదే టాస్క్ లో హౌజ్ మాజీ కెప్టెన్ జెస్సీ రవిని మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పాడు.నాగార్జున ఎదుట రవికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి షాక్ ఇచ్చాడు జశ్వంత్.
రవి తనని గైడ్ చేయాల్సిన అవసరం లేదని.తన ఆట తాను ఆడుకుంటానని అంటున్నాడు జెస్సీ.
దీనికి రవి కూడా హౌజ్ లో అందరితో కలిసేలా తనని మోటివేట్ చేస్తున్నానని అంతేతప్ప తనని ఇన్ ఫ్లూయెన్స్ చేయట్లేదని అన్నాడు.మొత్తానికి జెస్సీ ఇచ్చిన మైండ్ యువర్ ఓన్ బిజినెస్ తో రవికి జెస్సీ షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు.
.