అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ మరియు భారత్ మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది.మొదట బ్యాటింగ్ దిగిన భారత్ 234 భారీ స్కోర్ చేయడం జరిగింది.
ఓపెనర్ శుభ్ మన్ గిల్ 126 పరుగులు చేయటంతో పాటు మిగతా బ్యాట్స్ మ్యాన్ లు కూడా భారీ స్కోర్ చేయడం జరిగింది.ఈ క్రమంలో 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్… 66 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.
భారత్ బౌలర్ ల దాటికి న్యూజిలాండ్ బ్యాట్స్ మ్యాన్ లు కుప్పకూలిపోయారు.ఎవరు కూడా క్రీజ్ లో నిలదోక్కుకోలేకపోయారు.దీంతో 168 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించటంతో.3 టి20 సిరీస్ నీ 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.భారత్ బౌలర్ లలో హార్దిక్ పాండ్యా నాలుగు టికెట్లు, ఉమ్రాన్ 2 వికెట్లు, మావి రెండు వికెట్లు… అర్ష్ దీప్ రెండు వికెట్లు… తీయడం జరిగింది.
తాజా వార్తలు