ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల పంచాయతీ ఎన్నికలు మరియు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణములో వైసిపి మంత్రులకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే.పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి నీ అదేవిధంగా పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని మాట్లాడకూడదు అంటూ మీడియా ముందు రాకూడదు అంటూ కీలక ఆదేశాలు నిమ్మగడ్డ ఇవ్వటం, ఆ తర్వాత వాళ్లు హైకోర్టుకు వెళ్ళటం .
జరిగింది.ఈ తరుణంలో కోర్టు కలుగజేసుకుని ఎన్నికల సంఘం పై గానీ నిమ్మగడ్డ పై గానీ మాట్లాడకూడదు అంటూ .మీడియా ముందు ఏదైనా మాట్లాడవచ్చు అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది.
ఇలాంటి తరుణంలో అప్పట్లో తమ విధులకు ఎస్ఈసి నిమ్మగడ్డ ఆటంకం కలిగించారని . అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కి మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు చేయటం మనకందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ పై చర్యలు తీసుకోవటానికి సిద్ధమైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానున్నట్లు.కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ విచారించనున్న ట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎవరని అడిగే అవకాశం ఉన్నట్లు అనంతరం ఎస్ఈసీకి నోటీసులు ఇవ్వనున్నట్లు ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.