నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఊహించని షాక్..!!

ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల పంచాయతీ ఎన్నికలు మరియు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణములో వైసిపి మంత్రులకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే.పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి నీ అదేవిధంగా పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని మాట్లాడకూడదు అంటూ మీడియా ముందు రాకూడదు అంటూ కీలక ఆదేశాలు నిమ్మగడ్డ ఇవ్వటం, ఆ తర్వాత వాళ్లు హైకోర్టుకు వెళ్ళటం .

 Big Unexpected Shock To Nimmagadda Ramesh Kumar-TeluguStop.com

జరిగింది.ఈ తరుణంలో కోర్టు కలుగజేసుకుని ఎన్నికల సంఘం పై గానీ నిమ్మగడ్డ పై గానీ మాట్లాడకూడదు అంటూ .మీడియా ముందు ఏదైనా మాట్లాడవచ్చు అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది.

ఇలాంటి తరుణంలో అప్పట్లో తమ విధులకు ఎస్ఈసి నిమ్మగడ్డ ఆటంకం కలిగించారని . అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కి మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు చేయటం మనకందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ పై చర్యలు తీసుకోవటానికి సిద్ధమైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానున్నట్లు.కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ విచారించనున్న ట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎవరని అడిగే అవకాశం ఉన్నట్లు అనంతరం ఎస్‌ఈసీకి నోటీసులు ఇవ్వనున్నట్లు ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube