ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి గట్టి షాక్ తగిలింది.తమను మోసం చేశారంటూ.
నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున ఆయనపై యుద్ధం ప్రకటించారు.మమ్మల్ని నియోజకవర్గంలో ఉండమంటారా? లేక.పక్కరాష్ట్రంలో కలిసిపోమంటారా? అంటూ.స్థానికులు నిలదీశారు.
దీంతో ఎమ్మెల్యే పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.విషయంలోకి వెళ్తే.
విజయనగరం జిల్లా గిరిజన నియోజకవర్గం.సాలూరు నుంచి విజయం సాధించిన పీడిక రాజన్నదొర.
ఎన్నికల సమయంలో ఇక్కడి గిరిజనులకు భారీ ఎత్తున హామీలు గుప్పించారు.
అయితే.
పార్టీ అధికారంలోకి వచ్చినా. ఏడాదిన్నర గడిచిపోయినా.
ప్రజలను ఆయన పట్టించుకోవడం లేదు.పైగా గిరిజనులు ఏ సమస్యపై చర్చించాలని భావించినా.
ప్రజలకు అందుబాటులో లేకుండా దోబూచులాడుతున్నారు.దీంతో ఆగ్రహించిన గిరిజనులు ఇటీవల ఎమ్మెల్యే కార్యాలయాన్ని కూడా ముట్టడించారు.
అయితే.అప్పట్లో నచ్చజెప్పి పంపేసినా.
మళ్లీ స్థానిక సమస్యలపై గిరిజనులు గళం వినిపించారు.తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతామని గిరిశిఖరంలోని కొదమ గ్రామ గిరిజనులు తెగేసి చెప్పారు.
గత ఏడాది సెప్టెంబర్ 9న తమ పంచాయతీకి వచ్చినప్పుడు 70 రోజుల్లో పట్టుచెన్నారు- చింతచెట్టు జంక్షన్ నుంచి కొదమకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.మూడు నెలలు దాటినా ఇంకా రోడ్డు పనులు ప్రారంభం కాలేదని… ఎప్పుడు నిర్మిస్తారన్నారని ప్రశ్నించారు.తమ గ్రామం పక్కన ఉన్న ఒడిశా గ్రామాలకు ఆ ప్రభుత్వం రోడ్లు వేసిందని తెలిపారు.
రోడ్డు వేయకుంటే తాము కూడా ఒడిశాలో కలిసిపోతామన్నారు.
వారితో ఎమ్మెల్యే రాజన్నదొర చర్చలు జరిపారు.రోడ్డు పని ప్రారంభానికి అటవీశాఖ అనుమతి రాలేదని, త్వరలోనే అనుమతి తీసుకుంటామని చెప్పారు.
రోడ్డు నిర్మించి.కొదమకు వస్తానని చెప్పారు.
మొత్తంగా ఈ పరిణామం.వైసీపీలో చర్చకు దారితీసింది.