తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే ప్రతి ఒక్కరూ చెప్పేది హుజూరాబాద్ ఉపఎన్నిక అని మాత్రమే.ఈనియోజకవర్గంలో ఇప్పుడు రోజు రోజుకూ పోటీ అన్ని పార్టీల నడుమ చాలా రసవత్తరంగా మారుతోందనే చెప్పాలి.
ఇప్పటికీ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే అన్ని పార్టీలూ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తోంది.ఎందుకంటే ప్రతిపార్టీకి కూడా ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి.
పట్టుదలను నిలబెట్టుకునేందుకు ఈటల రాజేందర్కు, తమ పరువు కాపాడుకునేందుకు టీఆర్ ఎస్కు, తన ఉనికిని చాటుకునేందుకు రేవంత్రెడ్డికి ఈ ఎన్నిక ఎంతో కీలకం.
ఈ క్రమంలోనే అన్ని పార్టీలూ కలిసి నియోజకవర్గం వ్యాప్తంగా ఎలక్షన్ హీట్ పెంచేస్తున్నాయి.
ఇక హుజూరాబాద్లో టీఆర్ ఎస్ను ఓడించి తన ఆత్మగౌరవ పథాకాన్ని నిలబెట్టుకునేందుకు ఈటల రాజేందర్ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.ఇక మొదటి నుంచి కూడా యనే హైలెట్గా రాజకీయ విమర్శలు చేస్తున్నాయి అన్ని పార్టీలు.
ఇక ఉద్యమ కారుల మద్దతు ఇప్పటికే ఈటల రాజేందర్కు పెద్ద ప్లస్ అనే చెప్పాలి.ఇదే నేపథ్యంలో ఎప్పటి నుంచో మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు మద్దతు తెలుపుతున్న కీలక నేత అయిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రీసెంట్ గా రేవంత్రెడ్డిని కలిశారు.
రేవంత్కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.
అయితే ఆయన కాంగ్రెస్లో చేరుతారని అంతా అనుకుంటున్న సమయంలోఆయన అనూహ్యంగా ఇవాళ ఈటలకు మద్దతు ప్రకటించారు.తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు అయిన చెరుకు సుధాకర్తో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ కు తమ మద్దతు ఉంటుందని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదని తెలిపారు.అయితే తమ మద్దతు కేవలం ఈటలకు మాత్రమే అని బీజేపీకి కాదని చెప్పి ట్విస్టు ఇచ్చారు.
దీంతో ఆయన వ్యూహం ఎవరికీ అర్థం కాకుండా ఉంది.ఇది రేవంత్కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.