మహారాష్ట్రలో కాంగ్రెస్కు షాక్ తగిలింది.పార్టీ శాసనసభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్ తన పదవికి రాజీనామా చేశారు.
మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని బాలాసాహెబ్ ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి పని చేయలేనంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు సమాచారం.
తనను పీసీసీ చీఫ్ అవమానించడమే కాకుండా తన కుటుంబ సభ్యులపై కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.