టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు శివరాత్రి బంపర్ గిఫ్ట్ వచ్చేసింది.తాజాగా రాధేశ్యాం సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ను సినిమా చిత్ర టీం సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.
కేవలం తెలుగు భాష మాత్రమే కాకుండా హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఉన్న పోస్టర్ లను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం.ఈ పోస్టర్ సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే.
ఈ పోస్టర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజ హెగ్డే రొమాన్స్ చేస్తున్న విధంగా పోస్టర్ చిత్రీకరించారు.హీరో హీరోయిన్లు ఇద్దరూ వ్యతిరేకదిశలో మంచు పై పడుకొని ఇద్దరు ఆకాశం వైపు చూస్తూన్న ఫోటోలను పూజ హెగ్డే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ పూజా హెగ్డే కొందరు దీన్ని పిచ్చి అంటారు.కాకపోతే, మేము ప్రేమగా పిలుచుకుంటాం.ఈ ప్రేమకథ మీ హృదయాల్లో చిరకాలం నిలిచిపోతుంది అంటూ రాసుకోచ్చింది.ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా ట్రేడ్ అవుతున్నాయి.
ఈ పోస్టర్లకు తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా వివిధ ఇండస్ట్రీల సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.వీరిద్దరి జోడి చూడడానికి చాలా చక్కగా ఉందనిఫాన్స్ ప్రశంశలు గుప్పిస్తున్నారు.శివరాత్రి పర్వదినాన సడన్ సప్రైజ్ కు ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు.రాదే శ్యాం సినిమాలో హీరోహీరోయిన్లుగా ప్రభాస్ పూజ హెగ్డే నటిస్తుండగా రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
కృష్ణం రాజు సమర్పణలో యు.వి.క్రియేషన్స్ అలాగే గోపీకృష్ణ మూవీస్ సంస్థలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది.1960 నాటి ఓ రొమాంటిక్ కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.2021 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా రహస్యం ప్రేక్షకులను అలరించబోతోంది.ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.