బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో అడవులలో నక్సల్్స, సిఆర్పిఎఫ్ కమాండోల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పులలో సిఆర్పిఎఫ్కి చెందిన పది మంది కమాండోలు, ఒక నక్సల్ మరణించారు.అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం యాక్షన్ (కోబ్రా) పటాలం సమావేశం ఔరంగాబాద్-గయా అటవీ ప్రాంతాలలో జరుగుతున్నట్టు తెలియటంతో సిఆర్పిఎఫ్ ఉన్నత కమాండో బెటాలియన్ ఇక్కడి అడవులలో కూంబింగ్ ప్రారంభించింది.
అయితే హఠాత్తుగా ఊడిపడ్డ నక్సల్స్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ పై కాల్పులు జరుపుతూ ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో కమాండోలు .ఎదురుకాల్పులు జరిపారు.ఒక నక్సల్ జరిపిన IED పేలుడులో 10 మంది సిఆర్పిఎఫ్ కమెండోలు అక్కడికక్కడే మరణించారు.దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగింది.ఒక నక్సలైట్ ఎన్కౌంటర్ చేయబడగా, మరికొందరు తప్పించుకున్నారు.
తమ బలగాలు కూంబింగ్ చేస్తున్న క్రమంలో జరిగిన నక్సల్స్ దాడిలో 10 సిఆర్పిఎఫ్ కమెండోలు మృత్యువాత పడ్డరని , మరో మగ్గురు క్షతగాత్రులయ్యారని మూడు గాయపడ్డారని .బీహార్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ (హెడ్ క్వార్టర్) సునీల్ కుమార్, చెప్పారు.పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) కి చేర్చామని చెప్పారు.
మరోవైపు కుందన్ కృష్ణన్ ఐజి (ఆపరేషన్స్), జిల్లా పోలీసు ఉన్నత అధికారుల సారధ్యంలో ఘటనా స్ధలంలో పెద్దెత్తున పోలీసు బలగాలను మోహరించి అణువణువూ గాలిస్తున్నారు.ఈ ప్రాంతం నుంచి కొన్ని ఆయుధాలు మరియు మందుగుండు కూడా సైట్ నుంచి స్వాధీనం చేసుకున్నారని సమాచారం.