నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రూపొందిన సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది చూడాలి.ఈ సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి మరో ఫిదా అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
అయితే సినిమా చిత్రీకరణ విషయంలో చక చక జరిగినా కూడా కరోనా వల్ల గత ఏడాది నుండి వాయిదా పడుతూ వచ్చింది.ఎట్టకేలకు సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ఈ సినిమాకు గట్టి పోటీ తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
నాని నటించిన టక్ జగదీష్ సినిమా ను అదే రోజున ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు.ఆ తర్వాత కంగనారనౌత్ నటించిన తలైవి సినిమాను తెలుగు లో అదే రోజున విడుదల చేయబోతున్నారు.
ఇక నితిన్ మాస్ట్రో సినిమాను కూడా ఈ నెల 9న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నా పోటీ కారణంగా ఏ మాత్రం వసూళ్లు సాధిస్తుంది అంటూ కొందరు అనుమానంగా ఉన్నారు.
సాయి పల్లవి హీరోయిన్ అవ్వడం వల్ల లవ్ స్టోరీ సినిమా స్థాయి పెరిగింది.
అంతకు మించి అన్నట్లుగా లవ్ స్టోరీ సినిమా ఉంటుంది అనే నమ్మకం అందరిలో ఉంది.కాని సినిమా విడుదల విషయం వచ్చేప్పటి వరకు అనేక అవరోదాలు మరియు అవాంతరాలు ఉండటం వల్ల సినిమా ఏ మేరకు వసూళ్లు సాధిస్తుంది అనేది తెలియడం లేదు.శేఖర్ కమ్ముల గత చిత్రం ఫిదా వంద కోట్లు రాబట్టింది.
మరి ఈ సినిమా ఏ మేరకు రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.