బిగ్ బాస్ సీజన్ లో సర్ప్రైజ్ గెస్ట్ గా కెఎ పాల్! వాఖ్యతగా ఆ స్టార్ హీరో

బిగ్ బాస్ సీజన్ 3 కి రంగం సిద్ధం అవుతుంది.మరో నెలరోజులలో అన్నపూర్ణ స్టూడియో లో బిగ్ బాస్ హౌస్ లోకి కంటిస్టెంట్ లు ఎంటర్ అయిపోతారు.

 Big Boss Team Plan To Sudden Surprises For House-TeluguStop.com

ఇక బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్ త్రీని మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం మొదలెట్టారు.దానికోసం ఇప్పటికే హౌస్ లోకి వెళ్ళే సెలబ్రిటీలని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ లో జబర్దస్త్ యాంకర్ రష్మి, యాక్టర్ సుదీర్ పాల్గొంటారు అనే టాక్ వినిపిస్తుంది.అయితే అది ఎంత వరకు నిజం అనేది అప్పుడే చెప్పలేం.

కాకపోతే ఈ సారి టాలీవుడ్ నుంచి కాస్తా పేరున్న సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు అనేది మాత్రం వాస్తవం.అలాగే సోషల్ మీడియా యాప్స్ అయిన టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఓ సెలబ్రిటీకి హౌస్ లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇక బిగ్ బాస్ సీజన్ 3 కోసం అక్కినేని నాగార్జున ని నిర్వాహకులు రంగంలోకి దించుతున్నారని సమాచారం.ఇప్పటికే అతనితో సంప్రదింపులు కూడా జరిగాయని, అతను కూడా ఒకే అన్నాడని తెలుస్తుంది.

నాగార్జునతో ఈ బిగ్ బాస్ షోకి అదనపు కళ వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సారి బిగ్ బాస్ లో సడెన్ సర్ప్రైజ్ లుగా కొంత మంది గెస్ట్ లని ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతుందని సమాచారం.

అందులో ఒకరు రేణు దేశాయ్ కాగా, మరోకారు ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కెఎ పాల్ కూడా ఎంటర్ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది.మరి ఇంది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే బిగ్ బాస్ మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube