తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 4 సీజన్ తాజాగా 8వ వారం లోకి ఎంటర్ అయింది.గత వారం ఎలిమినేషన్ లో భాగంగా దివి ఎలిమినేట్ అయిపోయింది.
మళ్లీ ఈ వారం సంబంధించి తాజాగా ఎలిమినేషన్ కొరకు నామినేషన్ ప్రక్రియ జరిగింది.మొదట్లో చాలా బోరింగ్ గా ఉన్న ఈ షో ఈ మధ్యనే బాగా పేరు పొందింది.
ఇంతవరకు బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులు ఒకరిపై ఒకరు అంత సీరియస్ చూపించకపోయినా తాజాగా జరిగిన నామినేషన్ లో మాత్రం వారి మధ్య ఉన్న విభేదాలను కుండబద్దలు కొట్టారు.
తాజాగా జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ లో భాగంగా ఇంటి సభ్యుల ఫోటోలను మార్బుల్స్ పై ప్రింట్ చేయించి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు.
ఎవరినైతే నామినేషన్ చేస్తున్నారో వాటిని పగలగొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు.ఇందులో భాగంగా మొదట ప్రస్తుత ఇంటి కెప్టెన్ అవినాష్ నామినేషన్ పని మొదలు పెట్టాడు.
ఈయన లాస్య, హారిక లను నామినేట్ చేశాడు.ఆ తర్వాత వచ్చిన అమ్మ రాజా శేఖర్ అఖిల్, లాస్య ను నామినేట్ చేశాడు.
అయితే ఈనామినేషన్ లో భాగంగా తాజాగా అమ్మ రాజశేఖర్ కు అఖిల్ కు మధ్య వాగ్వివాదం జరిగింది.దీంతో కాసేపు బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం వేడెక్కింది.
ఆ తర్వాత అభిజిత్ ఎటువంటి రీజన్ చెప్పకుండానే మోనాల్ నేరుగా నామినేట్ చేశాడు.అలాగే అమ్మ రాజశేఖర్ ను కూడా నామినేట్ చేశాడు.
ఆ తర్వాత మెహబూబ్ అరియానా, మోనాల్ ను నామినేట్ చేశాడు.ఇలా మొత్తానికి ఈ వారంలో భాగంగా లాస్య, అరియనా, మోనాల్, అఖిల్, అమ్మ రాజశేఖర్, మెహబూబ్ లు నామినేట్ అయ్యారు.
ఈ మొత్తానికి 8 వ వారం ఎలిమినేషన్ లో ఈ ఆరుగురిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు.ఈ ఆరుగురిలో మోనాల్, అఖిల్ ఇద్దరు నామినేషన్ ఉన్నప్పటికీ వారిని ఎలాగో బయటికి పంపరు.
ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ హౌస్ సభ్యులు ప్రజలు వేసే ఓటింగ్ తో కాకుండా వారి ఇష్టానుసారంగా కంటెస్టెంట్స్ ను బయటికి పంపిస్తున్నారు అన్న వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి.చూడాలి మరి ఈ వారం ఈ ఆరుగురిలో ఎవరు బయటికి వెళ్లి పోతారో.