నిన్న మొన్నటి వరకు తెలుగు ప్రముఖ వార్తా ఛానల్ అయినటువంటి టీవీ9 లో న్యూస్ రీడర్ మరియు జర్నలిస్టుగా పని చేసినటువంటి దేవి నాగవల్లి కేవలం యాంకర్ గా మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. కానీ ఇటీవలే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దేవి నాగవల్లి ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో భాగంగా రోజుకో ఇంటర్వ్యూలో పాల్గొంటూ ప్రస్తుతం తెగ ట్రేండింగ్ అవుతోంది. అయితే తాజాగా దేవి నాగవల్లి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో తాను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మనవరాలని కొందరు తెగ ప్రచారం చేస్తున్నారనే విషయంపై స్పందించింది.
అయితే ఇందులో భాగంగా తాను ప్రముఖ స్వర్గీయ దర్శకుడు దాసరి నారాయణరావు కి మనవరాలు అవుతాననే మాట వాస్తవమేనని తెలిపింది. అయితే తమ కుటుంబ పరిస్థితుల కారణంగా తాను ఎప్పుడూ దాసరి నారాయణ రావు ని కలవలేదని కానీ దాసరి నారాయణ రావు గారు తాను టీవీ9 వార్తా ఛానల్ లో స్క్రీన్ మీద కనిపించినప్పుడు కొంతమంది దేవి నాగవల్లి మీకు మనవరాలు అవుతుందని చెప్పడంతో అప్పుడు తనని పిలిపించి ఒకసారి మాట్లాడారని చెప్పుకొచ్చింది.
అంతేకాక తన తాతయ్య దాసరి నారాయణ రావు చనిపోయిన రోజున కూడా ఆయన ఇంటి ముందు తన వృత్తిలో భాగంగా న్యూస్ కవర్ చేశానని అందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదని తెలిపింది.అంతేకాక తనకి జర్నలిస్టుగా సొంతంగా ఐడెంటిటీ ఉందని కాబట్టి తనను ఎవరైనా జర్నలిస్టుగా గుర్తిస్తే చాలా సంతోషంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అయితే ఒకప్పుడు తన అమ్మానాన్నల పెళ్లికి కూడా సీనియర్ స్టార్ హీరోలు శోభన్ బాబు, కైకాల సత్యనారాయణ తదితరులు హాజరయ్యారని తన తల్లి అప్పుడుడప్పుడు తనతో చెబుతుందని కానీ తాను మాత్రం ఎప్పటికీ తన గురించి ఇతరులతో చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడనని తెలిపింది.అలాగే దాసరి నారాయణ రావు గారు కేవలం తనకు బంధువు అవుతాడని అంతే తప్ప తాము ఎప్పుడూ సహాయం కోసం అతడి దగ్గరికి వెళ్లలేదని కూడా స్పష్టం చేసింది.