ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్

టాలీవుడ్ స్టార్ హీరో రేంజ్ నుంచి ఇండియన్ స్టార్ గా మారిపోయిన నటుడు డార్లింగ్ ప్రభాస్.బాహుబలి తర్వాత ఒక్కసారిగా అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

 Big Announcement From Prabhas Flick, Tollywood, Bollywood, Indian Cinema, Darlin-TeluguStop.com

నార్త్ ఇండియా ప్రేక్షకులకి కూడా ప్రభాస్ విపరీతంగా కనెక్ట్ అయిపోయాడు.దీంతో అతని తరువాత సినిమా సాహూకి హిందీలో మంచి ఆదరణ లభించింది.

తెలుగులో ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న హిందీలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.అదే ఊపుతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతుంది.దీంతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాని లైన్ లో పెట్టాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.ఇదిలా ఉంటే అంతకంటే ముందుగా ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో, అదే రేంజ్ లో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.ఇందులో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేని ఫైనల్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన మరో బిగ్ అనౌన్స్ మెంట్ రేపు రానుంది.ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కాసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

ఉదయం 10 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ వుంది అంటూ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.దీంతో ఆ విశేషం ఏమిటా? అంటూ ప్రభాస్ అభిమానూలు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో విలన్ పాత్ర పోషించే అవకాశం ఉందంటూ ఇటీవల ప్రచారం జరిగింది.మరి ఆ అప్డేట్ ద్వారా నాగ్ అశ్విన్ ఎలాంటి సమాచారం అందించబోతున్నాడు అనేదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube