ఈజీ మనీ కోసం యువత ఎంత దారుణంగా తప్పుడు మార్గాలు వైపు వెళ్తున్నారో ఈ మధ్య కాలంలో తరుచుగా జరిగే సంఘటనలు గుర్తుచేస్తూ ఉన్నాయి.అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా షార్ట్ కట్ లో మనీ సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు.
విలాసాలకి అలవాటు పడి తప్పుడు పనులు చేస్తూ చట్టం ముందు దోషులుగా నిలబడుతున్నారు.ఎన్నో ఆశలతో చదువుల కోసం పంపించిన తల్లిదండ్రులకి తెలియకుండా తప్పుడు పనులు చేసి వారి పరువు తీస్తున్నారు.
ఇలా తప్పుడు దారులవైపు వెళ్ళే యువతరంలో అబ్బాయిలు బ్లాక్ మెయిల్, దొంగతనాలు చేస్తూ ఉంటే, అమ్మాయిలు సింపిల్ గా వ్యభిచారం నమ్ముకున్తున్నారు.
శీలాన్ని మార్కెట్ లో పెట్టి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నారు.
ఒకప్పుడు పవిత్రంగా భావించం ఆడతనం ఇప్పుడు అంగడి సరుకుగా మార్చేసి విలాసాల కోసం వ్యభిచారులుగా మారుతున్నారు.ఒకప్పుడు ఎక్కడో ఊరి చివర కనిపించే వ్యభిచారులు ఇప్పుడు సమాజంలో అందరి మధ్యలో కలిసిపోయి దర్జాగా బ్రతికేస్తున్నారు.
తాజాగా భోపాల్ పట్టణంలో జరిగిన ఓ ఘటన అమ్మాయిలు విలాసాల కోసం ఎలాంటి పనులు చేస్తున్నారో తెలియజేసింది.భోపాల్ పట్టణంలో అమ్మాయిల గ్యాంగ్ అంతా కలిసి ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు.
వీరందరూ కలిసి కంబైన్డ్ స్టడీస్ చేసుకుంటామని ఫ్లాట్ లో స్ధిరపడ్డారు.ఇక పనిలో పనికి మొదట తమకు తెలిసిన వారితో వ్యభిచారం మొదలుపెట్టారు.
ఇక మొళ్లిగా బిజినెస్ డెవలప్ మెంట్ చేసుకోవడం కోసం ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ తమ ఫ్లాట్కు రప్పించే పని పెట్టుకున్నారు.తరచూ తమ ఫ్లాట్లో కొత్త వ్యక్తులు వస్తుపోతుడటం గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి భాగోతాలు బయట పడ్డాయి.