కింగ్ నాగార్జున త్వరలో వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
దీని తర్వాత తన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ ని నాగార్జున సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని అప్పట్లోనే నాగార్జున ప్లాన్ చేశారు.అయితే ఈ మధ్యలో చాలా కమిట్ మెంట్ లు ఉండటంతో పాటు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా ఇతర హీరోల సినిమాలతో బిజీగా ఉండటంతో వెంటనే సెట్ పైకి వెళ్ళలేదు.
అదే సమయంలో కళ్యాణ్ కృష్ణ ముందుగా సోగ్గాడు సీక్వెల్ కోసం చెప్పిన స్టొరీ లైన్ కూడా నాగార్జునకి కనెక్ట్ కాలేదని టాక్.
ఈ నేపధ్యంలో గత రెండేళ్ళ నుంచి సోగ్గాడు సీక్వెల్ బంగార్రాజు సినిమా స్క్రిప్ట్ పైనే కళ్యాణ్ కృష్ణ ఉన్నారు.
ఎట్టకేలకి ఈ సినిమాకి మోక్షం వచ్చింది.నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది.
ఇదిలా ఉంటే మొదటి భాగంలో ఉన్న రమ్యకృష్ణ ఈ సినిమాలో కూడా కొనసాగుతుంది.బంగార్రాజు యువకుడుగా ఉన్నప్పుడు ఎంత రొమాంటిక్ గా ఉండేవాడనే విషయాలని ఇందులో చూపించబోతున్నారు.
ఇక ఈ సినిమాలో భూమిక నెగిటివ్ రోల్ లో కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది.ఆమె పాత్ర నరసింహలో రమ్యకృష్ణ తరహలో ఉంటుందనే మాట వినిపిస్తుంది.
సెకండ్ ఇన్నింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న భూమికకి ఈ సినిమా ద్వారా విమెన్ విలన్ గా మంచి గుర్తింపు వస్తుందనే చర్చ నడుస్తుంది.