ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో హిట్ అవుతున్న సినిమాలు బాలీవుడ్ లోకి వెళ్తున్నాయి.అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100, జెర్సీ వంటి సినిమాలు అక్కడ వరుసగా రీమేక్ అవుతున్నాయి.
ఇక తెలుగులో మంచి కంటెంట్ తో వచ్చే కథలతో బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.ఈ నేపధ్యంలో తెలుగులో కొత్త కంటెంట్ తో వచ్చి హిట్ అవుతున్న సినిమాలని అక్కడి నిర్మాతలు వెంటనే బాలీవుడ్ లోకి తీసుకుపోతున్నారు.
ఇప్పుడు అదే దారిలో మరో తెలుగు హిట్ మూవీ వెళ్తుంది.ఈ మధ్య నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమా హిందీలో రీమేక్ కాబోతుంది.
దీనికి సంబందించిన సన్నాహాలు అక్కడ జరిగిపోతున్నాయి.
ఎక్కువగా తెలుగు కంటెంట్ ల మీద దృష్టిపెట్టె కరణ్ జోనర్ భీష్మ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాని హిందీలో రణబీర్ కపూర్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే స్క్రిప్ట్ రణబీర్ దగ్గరకి వెళ్లిందని కూడా టాక్ వినిపిస్తుంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రణబీర్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని కరణ్ జోనర్ భావిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాకి దర్శకుడుగా ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన వెంకి కుడుములని తీసుకుంటారా, లేదంటే బాలీవుడ్ నేటివిటీకి సింక్ అయ్యే అక్కడి దర్శకుడుని ఎంపిక చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.