యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే టాక్ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్లో మరో బ్లాక్బస్టర్ను అందుకున్నాడు.
ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాను తెరకెక్కించడంతో భీష్మ చిత్రంపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఫుల్ ఫాంలో ఉన్న అందాల భామ రష్మిక మందన ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా కూడా హిట్ అవ్వడం ఖాయమని ముందే ఓ అంచనాకు వచ్చేసారు జనం.ఇక సినిమా రిలీజ్ రోజునే మంచి టాక్ను సొంతం చేసుకోవడంతో పాటు పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం క్యూ కట్టారు.ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది.
సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.27.09 కోట్ల మేర షేర్ కలెక్షన్లు రాబట్టి బయ్యర్లకు లాభాలను చేకూర్చింది.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా రెండు వారాల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 8.78 కోట్లు
సీడెడ్ – 3.20 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.96 కోట్లు
ఈస్ట్ – 1.70 కోట్లు
వెస్ట్ – 1.27 కోట్లు
గుంటూరు – 1.79 కోట్లు
కృష్ణా – 1.53 కోట్లు
నెల్లూరు – 0.76 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 21.99 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.91 కోట్లు
ఓవర్సీస్ – 3.19 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ – 27.09 కోట్లు