తెలుగులో ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల దర్శకత్వం వహించిన “భీష్మ” అనే చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించగా హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించింది.
అలాగే ఈ చిత్రంలో ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలో హెబ్బా పటేల్ మరియు కేజిఎఫ్ ఫెమ్ అనంతనాగ్ నటించారు.అయితే ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా థియేటర్లను మూసివేయడంతో ఎక్కువ రోజులు సినీ థియేటర్లలో ఆడలేదు.
దీంతో దర్శకనిర్మాతలకు పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.
అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా థియేటర్లను ఇప్పుడప్పుడే తెరిచే అవకాశాలు లేకపోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమ్మేసారు.
దీంతో ఈ చిత్రం ఈనెల 25వ తారీఖున నుంచిన నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.అయితే తెలుగులో భీష్మ చిత్రం మంచి హిట్ కావడంతో ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎక్కువ మొత్తం దర్శక నిర్మాతలకు ముట్ట చెప్పినట్లు సమాచారం.
అయితే ఎప్పటినుంచో సరైన హిట్ కోసం తహతహలాడుతున్న నితిన్ కి భీష్మ రూపంలో హిట్ వచ్చినప్పటికీ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసే టైం లో లాక్ డౌన్ విధించడంతో నితిన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నితిన్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న రంగ్ దే అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.