యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్లో మరో అదిరిపోయే సక్సెస్ను వేసుకున్నాడు.
దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపించారు.
ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా నితిన్ కెరీర్లో మంచి వసూళ్లను సాధించింది.
అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలకు పైగా కావడంతో ఈ సినిమా కలెక్షన్లు పూర్తిగా తగ్గినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.కాగా కలెక్షన్లు తగ్గినా, థియేటర్ల నుండి సినిమాను తీసేసినా నష్టం ఏమీ లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఇప్పటికే లాభాలతో కలిసి వెనక్కి వచ్చాయని వారు అంటున్నారు.
రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పటికే రూ.25 కోట్లకుపైగా వసూళ్లు సాధించి లాభాలను తెచ్చిపెట్టింది.ఇక ఈ సినిమాను త్వరలోనే డిజిటిల్ ప్లాట్ఫాంపై రిలీజ్ చేసేందకు సన్నాహాలు చేస్తున్నారు.