యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ను సొంతం చేసుకుంది.ఈ సినిమాను ఛలో ఫేం డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా తొలిరోజే ప్రేక్షకులను మెప్పించడం, బాక్సాఫీస్ వద్ద మరే ఇతర సినిమాలు పోటీలో లేకపోవడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.
నితిన్ తనదైన యాక్టింగ్తో మెప్పించగా, ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు లైన్ కట్టారు.
ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ తన సత్తా చాటుతోంది.తొలి వారం ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.50 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది.నితిన్ కెరీర్లో బిగ్ హిట్గా ఈ సినిమా నిలిచింది.
ఇక ఈ సినిమాకు ఓవర్సీస్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా అక్కడ అరుదైన ఫీట్ చేయడానికి రెడీ అయ్యింది.రీసెంట్గా ఈ సినిమా యూఎస్లో $853,920 మార్కును అందుకుంది.
ఈ వీకెండ్ ముగిసే సరికి భీష్మ చిత్రం ఖచ్చితంగా మిలియన్ డాలర్ మార్క్ను అందుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సాగర్ మహతి సంగీతం అందించగా సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేశాడు.
ఈ సినిమా రిలీజ్కు ముందే లాభాలు తెచ్చిపెట్టడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పుడు బయ్యర్లకు కూడా ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టడంతో వారు పండగ చేసుకుంటున్నారు.