పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటోంది.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.ఈ క్రమంలోనే క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరుపుకుంటున్నారు.
ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, రానా అలసి పోవడంతో షూటింగ్ గ్యాప్ లో అలా సేద తీరారు.
ఈ క్రమంలోనే షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ నులక మంచం పై, రానా ఎద్దుల బండి పై సేదతీరుతూ ఉన్నటువంటి ఫోటోలను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్గా తెరకేక్కిస్తున్నారు.
ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరన జరుపుకుంటోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటించగా రానా సరసన మలయాళ నటి సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఇకపోతే ఈ సినిమా చిత్రీకరణ త్వరగా పూర్తి చేసుకుని ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు.