పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసెంట్ వరుస సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే.ఈయన ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో భీమ్లా నాయక్ ఒకటి.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందుతుంది.
పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంటే.
రానా దగ్గుబాటి జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొండడంతో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాపై ఒక క్రేజీ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ పై ఊహాగానాలు మొదలయ్యాయి.ఈ సినిమాకి షాకింగ్ రన్ టైమ్ ను మేకర్స్ ఫిక్స్ చేసారని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమాకు కేవలం 2 గంటల 10 నుండి 12 నిముషాలు మాత్రమే లాక్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ రన్ టైమ్ ఉన్న సినిమాలు రానే రావడం లేదు.అందులోను స్టార్ హీరో సినిమాలు అయితే అస్సలు రావడం లేదు.కానీ భీమ్లా నాయక్ మాత్రం తక్కువ రన్ టైమ్ తోనే మన ముందుకు రానుందట.అయితే మేకర్స్ మాత్రం ఈ అవుట్ ఫుట్ తో చాలా హ్యాపీ గా ఉన్నారట.
ఈ సినిమా తప్పకుండ ఘన విజయం సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.