పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘భీమ్లా నాయక్’.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుని మరి ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.
ఇక మాటల మాంత్రికుడు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందిస్తుండడంతో ఈ సినిమా మరొక రేంజ్ కు వెళ్ళిపోయింది.ముందు నుండే అంచనాలు ఉన్నా కూడా ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్ ల కారణంగా మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి.ఇక నాలుగవ పాట కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన మూడు సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ సాంగ్ కూడా అదిరి పోవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 1న రావాల్సిన ఈ పాట కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేక పోవడంతో తాజాగా ఈ రోజు ఈ పాటను రిలీజ్ చేసారు.అడవి తల్లి మాట సాంగ్ ను ఈ రోజు ఉదయం విడుదల చేసారు.
తమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది.ఈ పాట కూడా మరో చార్ట్ బస్టర్ గా నిలిచి పోతుందని అనుకుంటున్నారు.ఇక ఈ సాంగ్ రిలీజ్ కు ముందుగా లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి నివాళులు అర్పించి ఈ సాంగ్ ను మొదలు పెట్టారు.
ఇక ఈ పాట కూడా సూపర్ హిట్ లిస్టులో చేరిపోతుంది.ఇక ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంటే.రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న విడుదల అవుతుంది.