టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా మన తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ గ్లిమ్స్, మేకింగ్ వీడియో, ఫస్ట్ సింగిల్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ టీమ్ సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది.అంత ఇష్టం అనే మరో పాట ప్రోమోను మేకర్స్ కొద్దీ సేపటి క్రితం విడుదల చేసింది.
అంత ఇష్టం ఏందయ్యా.అంత ఇష్టం ఏందయ్యా నీకు నా మీద అంటూ ఈ పాట పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ మీద సాగుతున్న ఈ ప్రోమో అలరించింది.కేవలం 40 సెకన్ల వీడియో ను విడుదల చేసింది చిత్ర యూనిట్.భీమ్లా నాయక్ లోని ప్రేమ కోణాన్ని ఈ పాట ద్వారా బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు.
ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
ఇక ఈ పాట లిరికల్ వీడియోను దసరా రోజు అక్టోబర్ 15న ఉదయం 10.19 నిముషాలకు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.ఇది మలయాళ వర్షన్ లో హీరో హీరోయిన్ల మధ్య పాటలు లేవు.
కానీ మన తెలుగు నేటివిటీకి పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.