పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేనంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మరొక సినిమా కూడా చేస్తున్నాడు.
యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా కూడా చేస్తున్నాడు.
ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతుంది.
ఇందులో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు.ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంటే రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.
ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగా మరొక సినిమా కూడా పవన్ ప్రకటించాడు.హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటించారు.భవదీయుడు భగత్ సింగ్‘ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రకటించిన దగ్గర నుండి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జతగా పూజా హెగ్డే నటిస్తుంది.
ఇక ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమా దసరా రోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించ బోతున్నట్టు తెలుస్తుంది.ఇక నవంబర్ మొదటి వరం నుండి ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతున్నట్టు టాక్.ఇక ఇప్పటికే షూటింగ్ పనులు కూడా హరీష్ శంకర్ స్టార్ట్ చేసాడట.
భీమ్లా నాయక్ షూటింగ్ చివరి దశకు చేరుకుండడంతో ఇక ఈ సినిమా స్టార్ట్ చేయాలనీ పవన్ భావిస్తున్నాడట.
మరో పక్క భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది.
ఇక భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో దూకబోతుంటే.హరిహర వీరమల్లు కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక భవదీయుడు భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.