ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్-2’ చిత్రం ఖచ్చితంగా ఒకటిగా ఉంటుంది.గతంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్(తెలుగులో భారతీయుడు) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఈ సినిమాతో ఇండియన్ స్టార్గా మారిపోయాడు.ఇక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అప్పట్లో ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాకు సీక్వెల్గా ఇండియన్-2 చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన శంకర్, శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు.
కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అయితే ఈ సినిమా కోసం శంకర్ ఓ అట్టర్ ఫ్లాప్ మూవీ స్ట్రాటెజీని వాడబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు’ అనే టైటిల్స్తో ఈ బయోపిక్ చిత్రాన్ని రిలీజ్ చేశారు.అయితే ఎన్టీఆర్ బయోపిక్ను ఆయన కొడుకు తెరకెక్కించడంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ భావించారు.
కానీ సినిమాలో పెద్దగా ఆకట్టునే అంశాలు లేకపోవడంతో ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.ఎన్టీఆర్ క్రేజ్ను ఇలా రెండు భాగాలుగా క్యాష్ చేసుకోవాలని చూసిన చిత్ర యూనిట్కు భంగపాటు తప్పలేదు.
ఇప్పుడు ఇదే తరహాలో భారతీయుడు-2 చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.మంచి కాన్సెప్ట్ ఉన్న కథ కావడంతో ప్రేక్షకులు ఎలాగైనా చూస్తారనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారట చిత్ర యూనిట్.
ఇక భారీతీయుడు-2 చిత్రంతో అదిరిపోయే లాభాలు గడించాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.మరి వారి ఆశలను ప్రేక్షకులు ఎంతమేర నెరవేరుస్తారు, అసలు ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవుతుందా అనే సందేహం సర్వత్రా నెలకొంది.