కమల్ హాసన్ కెరియర్ లో మరిచిపోలేని చిత్రాలలో ఒకటిగా భారతీయుడు నిలుస్తుంది.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అవినీతి మీద ప్రతీకారం తీర్చుకొని ఒక స్వాతంత్య్ర సమరయోధుడు పాత్రలో కమల్ హాసన్ వృద్ధుడుగా కనిపిస్తాడు.
తప్పుడు మార్గాలలో వెళ్లి అవినీతికి అలవాటుపడిన కొడుకు ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడని వ్యక్తిగా అందులో కమల్ నట విశ్వరూపం చూపించాడు.కమల్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది.
ఇప్పటికీ ఇండియాలో అవినీతి మీద తెరకెక్కించే ఏ సినిమాకి అయినా మూలం భారతీయుడు అని చెప్పాలి.ఇప్పుడు శంకర్ భారతీయుడుకి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమై కొన్ని కారణాల వలన ఆగిపోయింది.మళ్ళీ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పూర్తిగా వాయిదా పడిపోయింది.
లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా స్టార్ట్ చేయాలని దర్శకుడు శంకర్ భావించినా నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.దీంతో శంకర్ నిర్మాతలకి ఒక బహిరంగ లేఖ కూడా రాసాడు.
ఈ లేఖ రాసిన తర్వాత నిర్మాతలు కమల్, శంకర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యం శంకర్ బడ్జెట్ విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గడంతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి నిర్మాతలు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, అయితే ఎన్నికల నేపధ్యంలో ఒక నెల రోజులు షూటింగ్ చేసి మరల ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత పూర్తి చేయడానికి కమల్ సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి.