దాదాపు పన్నెండు నెలలుగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి విముక్తి ఎప్పుడెప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్న దేశప్రజల ఆశలను నెరవేరుస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నేడు అన్ని రాష్ట్రాల్లో విజయవంతగా ముందుకు సాగుతుంది.
అక్కడక్కడ ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ వికటిస్తున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తాము రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ పై ధీమా వ్యక్తం చేస్తోంది భారత్ బయోటెక్.
ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని చెబుతున్న భారత్ బయోటెక్ ఒకవేళ ఎవరికైనా దీనివల్ల తీవ్రస్థాయిలో దుష్పరిణామాలు కలిగితే వారికి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమని పేర్కొంటుంది.
అయితే ఆ పరిణామాలు వ్యాక్సిన్ కారణంగానే అని నిరూపితమైతేనే తాము ఈ పరిహారం అందిస్తామని స్పష్టం చేస్తుంది.
ఇందుకు గాను కొవాగ్జిన్ టీకా తీసుకునే వారు భారత్ బయోటెక్ విధివిధానాలకు అంగీకరిస్తున్నట్టు పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందనే కండీషన్ కూడా పెట్టింది.అంటే ఈ వ్యాక్సిన్ కారణంగా ప్రాణాలు కోల్పోతే ఆ మరణించిన కుటుంబానికి ఈ సంస్ద ఆర్ధిక సహాయం చేస్తుందన్న మాట.ఒకరకంగా ఈ వ్యాక్సిన్ వేసుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే అని అనుకుంటున్నారట ఈ విషయం విన్న వారు.