దేశంలో కరోనా తీవ్రంగా వింజృంభిస్తున్న సమయంలో ఈ మాయదారి రోగానికి మందు ఉంటే బాగుండని అనుకోని వారు ఉండరు.ఈ క్రమంలో భారత్ బయోటెక్ కోవిడ్ టీకాను ప్రవేశపెట్టింది.
దీంతో పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా ప్రజలు ఫీలయ్యారు.
ఇక ప్రస్తుత పరిస్దితుల్లో దేశంలో ఈ టీకా వినియోగం పెరిగిపోయింది.
ఈ నేపధ్యంలో కరోనా సెకండ్ వేవ్ కూడా తన పని తాను చేసుకుంటు వెళ్లుతుంది.ఫలితంగా కరోనా కేసులు భారీగా పెరిగి పోతున్నాయి.
ఇలాంటి టైం లో కరోనా టీకా కార్యక్రమం నిదానంగా నడుస్తోంది.
అదీగాక మనకన్నా విదేశాలకు ఎక్కువ డోసులను పంపిస్తున్నారన్న ఆరోపణలూ కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే టీకా డోసుల ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్న ప్రభుత్వానికి ఈ సంస్థలు షాకిచ్చాయి.ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలంటే రూ.100 కోట్ల నిధులు ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం.మరి వీరి విజ్ఞప్తికి కేంద్రం సిద్దంగా ఉందా లేదా తెలియదు.