దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడుగానే కాకుండా నటుడుగా కూడా ఎన్నో మరిచిపోలేని పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.కొన్ని పాత్రలకి ఆయన తప్ప మరొకరు సరిపోరు అన్నంతగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తూ ఉంటారు.
ఎస్పీబీ నటించిన అలాంటి సినిమాలలో ఒకటి మిథునం.తనికెళ్ళ భరణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెండే పాత్రలు ఉంటాయి.
అవి వృద్ధాప్యంలో ఉండి జీవిత చరమాంకంలో ప్రేమ అనుభూతిని ఆశ్వాదించే దంపతుల కథగా మిథునం ఉంటుంది.ఈ రెండు పాత్రలతోనే అద్భుతమైన కథనాన్ని భరణి నడిపించి అన్ని ఎమోషన్స్ ని తెరపై ఆవిష్కరించారు.
దంపతులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ యాక్టర్ లక్ష్మి నటించారు.వారిద్దరూ ఒకరిని మించి ఒకరు పోటీపడి సినిమాలో నటించారు.
ఒక వర్గం ప్రేక్షకులకి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.ఆయా పాత్రలలో అమితాబచ్చన్ రేఖ నటిస్తారని టాక్ నడిచింది.దీనిపై తాజాగా తనికెళ్ళ భరణి క్లారిటీ ఇచ్చారు.
అమితాబచ్చన్ తో మిథునం రీమేక్ చేయాలని ఆరేళ్ళ క్రితమే అనుకున్నామని అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని చెప్పుకొచ్చారు.అయితే ఈ సినిమా కంటే ముందుగా తెలుగులో రాఘవేంద్రరావు మెయిన్ లీడ్ లో ఒక సినిమా చేస్తున్నానని, అది పూర్తయిన తర్వాత మిథునం రీమేక్ ఉంటుందని చెప్పారు.
మొత్తానికి ఈ మిథునం రీమేక్ తో భరణి బాలీవుడ్ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేసేశారు.