చిన్న సినిమాల దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయమైన మారుతి అతితక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్నాడు.క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో పాటు హార్రర్ కామెడీ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించి సక్సెస్ అందుకున్న మారుతి ఇటీవల సాయి ధరమ్ తేజ్తో కలిసి ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు.
ఇక ఈ డైరెక్టర్ కెరీర్లో భలే భలే మగాడివోయ్ చిత్రం బిగ్గెస్ట్ హిట్గా నిలవగా, ఆయన ఎంతో ఇష్టంగా తీసిన మహానుభావుడు చిత్రం యావరేజ్ హిట్గా నిలిచింది.ఈ రెండు సినిమాల కథలను కలిపి ఓ సినిమా చేసేందుకు ఇప్పుడు మారుతి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు అతిశుభ్రతను పాటిస్తున్నారు.ఇదే తరహా కాన్పెస్ట్తో మహానుభావుడు సినిమా వచ్చింది.అయితే ఆ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు మహానుభావుడు సినిమా కాన్సెప్టుకు భలే భలే మగాడివోయ్లోని మెమరీ లాస్ కాన్సెప్టును కలిపి ఓ సరికొత్త ప్రయోగం చేసేందుకు మారుతి రెడీ అవుతున్నాడట.
ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు మెచ్చే తీరులో తెరకెక్కించేందుకు మారుతి మాస్టర్ ప్లాన్ చేస్తు్న్నాడు.మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.