సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ బార్జాత్య దర్శకత్వంలో మైనే ప్యార్ కియా సినిమా బాలీవుడ్ 31 ఏళ్ల క్రితం విడుదలై ఎంత సంచలన విజయం అందుకుందో అందరికి తెలిసిందే.ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్.
ఫ్యామిలీ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఓ విధంగా సల్మాన్ ఖాన్ కి ఈ సినిమా స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.
ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ ఒక్కసారిగా బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి.
ఇక ఈ సినిమాని సుమారు సౌత్ ఇండియన్ బాషలన్నింటిలో రిలీజ్ చేశారు.అన్ని చోట్ల సూపర్ హిట్ అయ్యింది.
తెలుగులో అయితే బాలీవుడ్ లో సమానంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది.అంత పెద్ద హిట్ అయిన సినిమాతో స్టార్ హీరోయిన్ క్రేజ్ ని సొంతం చేసుకున్న నటి భాగ్యశ్రీ ముందుగా ఆ సినిమాని రిజక్ట్ చేసింది అంటే ఎవరూ నమ్మడం కష్టం.
కానీ ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది.ప్రస్తుతం ఆమె ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో తిరిగి నటిగా రీఎంట్రీ ఇస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా కీలక పాత్రలో కనిపించబోతుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను మైనే ప్యార్ కియా సినిమాను ఏడు సార్లు తిరస్కరించినట్లు వెల్లడించారు.
నాకు అప్పటికి సినిమాలలో నటించాలనే ఆలోచన లేదు.ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకున్నాను.దానికి అడ్మిషన్ కూడా పొందాను.నా తండ్రి భారతదేశంలోనే నా ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలని కోరుకున్నారు.
దానితో మైనే ప్యార్ కియా చేయవలసి వచ్చింది.నేను సూరజ్ బర్జాత్య కి సినిమాల్లో పనిచేయడం ఇష్టం లేదని చెప్పాను.
అయితే అతను నాతో చెప్పిన స్క్రిప్ట్ నాకు నచ్చింది.కానీ స్క్రిప్ట్ నచ్చినప్పటికీ నేను దానిని చేయలేనని చెప్పాను.
స్క్రిప్ట్లో మార్పులతో బర్జాత్య ఏడుసార్లు నావద్దకు వచ్చారు.అయితే ప్రతిసారీ ఒక కొత్త సాకు చెప్పేదాన్ని కానీ ఎనిమిదవ సారి నేను ఏమీ చెప్పేలేకపోయాను.
దానితో ఈ చిత్రంలో నటిస్తానని చెప్పానంటూ భాగ్యశ్రీ తెలిపారు
.