తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “భద్ర” చిత్రంలో హీరో రవితేజ సరసన నటించి తన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసిన మలయాళ బ్యూటీ “మీరా జాస్మిన్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదటగా మీరా జాస్మిన్ తెలుగులో మాధవన్ హీరోగా నటించిన “రన్” చిత్రం ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయింది.
ఆ తర్వాత పలు తమిళ రీమేక్ చిత్రాలలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను బాగానే దగ్గరైంది.అంతేకాక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఒకానొక సమయంలో బిజీబిజీగా గడిపింది.
కానీ అనుకోకుండా మీరా జాస్మిన్ తన వైవాహిక జీవితంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక్కసారిగా తన సినిమా కెరీర్ తలకిందులైంది.అయితే 2014వ సంవత్సరంలో అనిల్ జాన్ టైటస్ అనే ఓ ప్రముఖ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పెళ్లయిన కొత్తలో వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.కానీ ఏమైందో ఏమో గాని పెళ్లయ్యి రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే మీరా జాస్మిన్ కోర్టులో విడాకులకు అప్లై చేసింది.
దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు కూడా కరువయ్యాయి.
కాగా 2018వ సంవత్సరంలో కోర్టు ఇరువురికి విడాకులు మంజూరు చేసింది.దీంతో అప్పటి నుంచి మీరా జాస్మిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువనంతపురంలో ఉంటున్నట్లు సమాచారం.
అయితే ఆ మధ్య మీరా జాస్మిన్ కోలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ మాండలీన్ వాయించే ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకోబుతున్నట్లు పలు వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పటి వరకు నటి మీరా జాస్మిన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషలలో దాదాపు 50కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.అంతేగాక దాదాపుగా సినిమా పరిశ్రమకు సంబంధించి దాదాపు 20కి పైగా అవార్డులను కూడా అందుకుంది.అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో పెళ్లి విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే మీరా జాస్మిన్ కెరియర్ ముగిసిపోయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా మీరా జాస్మిన్ మలయాళంలో “పూమారమ్” అనే చిత్రంలో 2018వ సంవత్సరంలో చివరగా కనిపించింది.మళ్లీ ఇప్పటి వరకు ఈ అమ్మడికి సంబంధించిన ఎలాంటి సినిమా సమాచారం అందుబాటులో లేదు.