పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బస్తి దావఖానను అందుబాటులోకి తెస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని గురు బ్రహ్మ నగర్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దావఖానాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
ప్రత్యేక వైద్యశాలలో 52 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మెరుగైన చికిత్స లు అందే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేశంలో అత్యధికులు ఎదుర్కొంటున్న బీపీ షుగర్ తో పాటు అన్ని రకాల మందులను దావకాన లో పొందవచ్చునని చెప్పారు.వైద్యం ఖరీదు అవుతున్న సమయంలో బస్తీలలో నివసించే పేద ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిన వైద్యశాలలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
.