మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరూ అంటారు.ఇక సినిమాలు వచ్చే టైంలో ఓపెనింగ్ కూడా దీనికి సంబందించిన ప్రకటన వేస్తారు.
మద్యపానం వలన ఇండియాలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది.అయితే మద్యపానంకి బానిసగా మారితే అది ప్రాణాలు హరించేస్తుంది.
కాని మోతాదులో తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.గుండె జబ్బులు ఉన్నవారు రోజుకి ఓ పెగ్గు మద్యం తీసుకోవాలని డాక్టర్లు సూచించిన సందర్బాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ మరో ఆసక్తికరమైన విషయం చెప్పింది.
మనుషుల ఆరోగ్యానికి పాల కంటే రోజూ ఓ పెగ్గు బీరే బెటర్ అని పెటా చెబుతోంది.
దీనిపై ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలు చేసి విడుదల చేసిన రిపోర్టు ఆధారంగా పెటా ఈ విషయాన్ని తెలియజేసింది.
పాలకంటే బీరులో ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయని తెలుపుతుంది.ఆవులు, గేదెల నుంచి పాలు తీయకూడదని, వాటి పిల్లలకి పాలు లేని పాపం చేయొద్దని పెటా చెబుతుంది.
అందుకే ప్రతి ఒక్కారు పాలకి బదులు బీరు తాగాలని సూచిస్తుంది.అయితే పెటా చెబుతున్న మాటని విదేశాలలో అయితే బాగానే ఫాలో అవుతారు.
కాని ప్రాచీన కాలం నుంచి పాలుకి ప్రాధాన్యత ఇచ్చి బీరుని ప్రమాదంగా చూసే భారతీయులు ఫాలో అవ్వాలంటే మాత్రం కాస్తా కష్టమనే చెప్పాలి.