కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది.కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కరోనా మూడో దశకు ఆజ్యం పోయడంతో.
ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.భారత్లోనూ కరోనా పాజిటివ్ కేసులు గత పది రోజుల్లోనే భారీగా పెరిగి పోయాయి.
నిన్నొక్క రోజే దేశ వ్యాప్తంగా లక్షా డబ్బై వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్ర తరంగా మారిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
అలాగే ఒమిక్రాన్ కేసులూ దేశంలో అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.ఈ నేపథ్యంలోనే కరోనా నుంచి తప్పించుకునేందుకు మళ్లీ రోగ నిరోధక వ్యవస్థను బలపరుచుకోవాలని ప్రజలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్ను డైట్లో చేర్చుకుంటే చాలా వేగంగా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.మరి ఆలస్య మెందుకు ఆ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక క్యారెట్, రెండు అంగుళాల అల్లం ముక్క తీసుకుని పీల్ తొలగించి నీటిలో కడిగి.ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పచ్చి పసుపు కొమ్ము వేసి మెత్తగా పొడి చేయాలి.ఆ తర్వాత అందులో కట్ చేసుకున్న క్యారెట్, అల్లం ముక్కలు వేసి వాటర్ సాయంతో జ్యూస్లా తయారు చేసుకుని ఉదయాన్నే సేవించాలి.
ఈ డ్రింక్ను వారంలో మూడు లేదా నాలుగు సార్లు తాగితే గనుక రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.దాంతో కరోనానే కాదు సీజనల్ వ్యాధులు సైతం దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అలాగే పైన చెప్పిన జ్యూస్ను తీసుకుంటే రక్త హీనత పరార్ అవుతుంది.కంటి ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.
మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.